25
Friday
April, 2025

A News 365Times Venture

YSRCP: మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి..

Date:

YSRCP: విశాఖపట్నంలో అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఘన నివాళి అర్పించారు. ఇక, ఎల్ఐసీ జంక్షన్ దగ్గర అంబేడ్కర్ విగ్రహానికి రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పండుల రవీంద్రబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Read Also: PM Modi: కాంగ్రెస్‌కి ఓటు బ్యాంక్ వైరస్.. వక్ఫ్‌ చట్టంపై మోడీ సంచలనం..

ఇక, వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ దమ్ముతో అంబేడ్కర్ స్మృతి వనం ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి చంద్రబాబుకి ఏ హక్కు ఉందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతా.. మా పార్టీ నుంచి డబ్బులు వేసుకుని అంబేడ్కర్ స్మృతి వనాన్ని కాపాడుకుంటాం.. దేశంలో సామాజిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి.. వక్ఫ్ చట్టం తీసుకురావడం అన్యాయం అన్నారు. ఇక, చంద్రబాబు తెచ్చిన పీ-4 నమ్మశక్యంగా లేదు.. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు చెప్పుకొచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪುಲ್ವಾಮ ಘಟನೆ ಬಳಿಕ ಸ್ವಲ್ಪವೂ ವಿಶ್ರಮಿಸಬಾರದಿತ್ತು: ಉಗ್ರರ ದಾಳಿಗೆ ಇಂಟಲಿಜೆನ್ಸ್ ವೈಫಲ್ಯ ಕಾರಣ-ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಚಾಮರಾಜನಗರ,ಏಪ್ರಿಲ್,24,2025 (www.justkannada.in):  ಈ ಹಿಂದೆ ಪುಲ್ವಾಮ ದಾಳಿಯಲ್ಲಿ 40 ಸೈನಿಕರು...

പഹല്‍ഗാം ഭീകരാക്രമണത്തിന്റെ ഉത്തരവാദിത്തം ഏറ്റെടുത്ത് അമിത് ഷാ രാജിവെക്കണം: സഞ്ജയ് റാവത്ത് എം.പി

ന്യൂദല്‍ഹി: പഹല്‍ഗാം ഭീകരാക്രമണത്തിന്റെ ഉത്തരവാദിത്തം ഏറ്റെടുത്ത് രാജിവെക്കണമെന്ന് കേന്ദ്ര ആഭ്യന്തര മന്ത്രി...

“போர் நடவடிக்கை, மக்களின் உரிமை அபகரிப்பு..'' – சிந்து நீர் ஒப்பந்த நிறுத்தம் பற்றி பாகிஸ்தான்!

பஹல்காம் தீவிரவாத தாக்குதலுக்குப் பிறகு சிந்து நீர் ஒப்பந்தத்தை இந்தியா நிறுத்தி...

Telangana BJP అనుకున్నది సాధించగలిగిందా?

తెలంగాణ బీజేపీ అనుకున్నది సాధించగలిగిందా? ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌లో వేరే పార్టీ...