17
Thursday
April, 2025

A News 365Times Venture

Gorantla Madhav: గోరంట్ల మాధవ్ వ్యవహారంలో.. 12 మంది పోలీసులపై చర్యలు

Date:

వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 12మంది పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు తీసుకొస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీస్ కాన్వాయ్ ను వెంబడించడం, గుంటూరు చుట్టగుంట సెంటర్ లో కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. ఎస్పీ కార్యాలయంలోకి గోరంట్ల మాధవ్, అతని అనుచరులు రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read:Tragedy : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం.. కార్పెంటైన్ ఆయిల్ తాగి 21 నెలల చిన్నారి మృతి

మొత్తం వ్యవహారంపై నివేదిక తెప్పించుకున్న ఉన్నతాధికారులు ఎస్.బి. డీఎస్పీ సీతారామయ్యను వీఆర్ కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. మాధవ్ కు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు బందోబస్తులో ఉన్న 11మంది పోలీసులను సస్పెండ్ చేశారు. అరండల్ పేట సీఐ వీరాస్వామి, నగరంపాలెం, పట్టాభిపురం ఎస్సైలు రాంబాబు,రామాంజనేయులు, మరో ఎనిమిది మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Health Tips: ఈ ఫుడ్స్ తో నరాల బలహీనత మాయం..

నరాల బలహీనత తగ్గించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలు...

ಮೈಸೂರಿನಲ್ಲಿ40 ಮರಗಳ ಕಡಿದ ಜಾಗದಲ್ಲೇ ಗಿಡ ನೆಟ್ಟ ರೈತರು.

ಮೈಸೂರು,ಏಪ್ರಿಲ್,16,2025 (www.justkannada.in): ರಸ್ತೆ ಅಗಲೀಕರಣ ನೆಪವೊಡ್ಡಿ ಮೈಸೂರಿನ ಎಸ್ಪಿ ಕಛೇರಿ...

സിവില്‍ കേസ് ക്രിമിനല്‍ കേസാക്കിയ ഉത്തര്‍പ്രദേശ് പൊലീസിന് 50,000 രൂപ പിഴ ചുമത്തി സുപ്രീം കോടതി

ന്യൂദല്‍ഹി: സിവില്‍ കേസ് ക്രിമിനല്‍ കേസാക്കിയ യു.പി പൊലീസിന് പിഴ ചുമത്തി...

மேல்பாதி: சமூகப் பிரச்னையால் மூடப்பட்ட கோயில்; நீதிமன்ற உத்தரவால் திறப்பு… முழு பின்னணி!

அமைதிப் பேச்சு வார்த்தை தோல்விவிழுப்புரம் மாவட்டம், மேல்பாதி கிராமத்தில் அமைந்திருக்கிறது அருள்மிகு...