డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తీపికబురును అందించింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 309 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు భౌతిక శాస్త్రం, గణితంతో సైన్స్లో మూడేళ్ల పూర్తి సమయం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ (B.Sc.) కలిగి ఉండాలి. లేదా ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్లో పూర్తి సమయం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉండాలి.
Also Read:UP: 7 రోజులు బంధించి, 23 మంది సామూహిక అత్యచారం.. ఇంటర్ విద్యార్థినిపై దారుణం..
అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు కలిగి ఉండాలి. రిజర్డ్వ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PwBD/మహిళలు/అప్రెంటిస్లకు మినహాయింపు ఇచ్చారు. ఈ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష- అప్లికేషన్ వెరిఫికేషన్/ వాయిస్ టెస్ట్/ సైకోయాక్టివ్ సబ్స్టాన్సెస్ టెస్ట్/ సైకలాజికల్ అసెస్మెంట్/ ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్/ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ (పోస్టుకు వర్తించే విధంగా) ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40000 నుంచి 140000 జీతం ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 25-04-2025న ప్రారంభమై 24-05-2025న ముగుస్తుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.