15
Tuesday
April, 2025

A News 365Times Venture

Saudi Arabia: భారత్, పాక్ సహా 14 దేశాలపై వీసా బ్యాన్ విధించిన సౌదీ.. కారణం ఇదే..

Date:

Saudi Arabia: హజ్ భద్రతా సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా 14 దేశాలపై వీసా బ్యాన్ విధించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. ఈ ఏడాది హజ్ తీర్థయాత్ర ముగిసే జూన్ మధ్య వరకు ఈ నిషేధం ఉంటుంది. వీసా సస్పెన్షన్‌లో ఉమ్రా వీసాలతో పాటు వ్యాపార మరియు కుటుంబ సందర్శన వీసాలు కూడా ఉన్నాయి. సరైన రిజస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు వచ్చే వారిని నియంత్రించేందుకు సౌదీ అరేబియా ఈ దేశాలకు వీసాను నిషేధించింది.

Read Also: MA Baby: సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ.. ఆయన నేపథ్యం ఇదే..

అధికారిక అనుమతులు లేకుండానే చాలా మంది విదేశీయులు ఉమ్రా, విజిట్ వీసాలపై దేశంలోకి ప్రవేశించి, అనధికారికంగా హజ్ యాత్రలో పాల్గొని వెళ్లిపోతున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. హజ్ యాత్ర సజావుగా సాగడానికే సౌదీ అధికారులు ఈ కఠినమైన వీసా నిబంధనల్ని తీసుకువచ్చారు. హజ్ యాత్రకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ఇప్పటికే సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంట్లో భాగంగానే ఏప్రిల్ 13 వరకు మాత్రమే ఉమ్రా వీసాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ గడువు తర్వాత హజ్ ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయబడవు.

నిషేధం ఎదుర్కొంటున్న 14 దేశాల్లో.. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్ ఉన్నాయి. 2024లో జరిగిన విషాద సంఘటనల తర్వాత పకడ్బందీగా హయ్ యాత్రను నిర్వహించేందుకు సౌదీ అధికారులు సిద్ధమయ్యారు. 2024లో వేడిని తట్టుకోలేక 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది అనధికారిక యాత్రికులే.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പൂനെയിൽ എ.ബി.വി.പി പരാതിയെത്തുടർന്ന് ഐ.ഐ.എസ്.ഇ.ആറിൽ നടത്താനിരുന്ന അംബേദ്‌കർ ജയന്തിയോടനുബന്ധിച്ച പരിപാടി റദ്ദാക്കി

പൂനെ: പൂനെയിലെ ഇന്ത്യൻ ഇൻസ്റ്റിറ്റ്യൂട്ട് ഓഫ് സയൻസ് എഡ്യൂക്കേഷൻ ആൻഡ് റിസർച്ചിൽ...

பாமக: “நான்தான் தலைவன், மீண்டும் சொல்கிறேன்.." – அன்புமணி ராமதாஸ் அறிக்கை, முழுவிவரம்!

கடந்த சில மாதங்களாகவே பா.ம.க நிறுவனர் ராமதாஸுக்கும், அவரின் மகன் அன்புமணிக்குமிடையே...

Kiren Rijiju: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు

వక్ఫ్ చట్టంపై సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకోదని మైనారిటీ వ్యవహారాల మంత్రి...

5 ಸಾವಿರ ಎಕರೆ ಜಾಗ ವಿಚಾರ: ಪತ್ರ ಬರೆದ ಕಾರಣಕ್ಕೆ ಆ ಭಾಗದ ಜನರು ಆತಂಕ ಪಡಬೇಕಿಲ್ಲ- ಸಂಸದ ಯದುವೀರ್

ಮೈಸೂರು,ಏಪ್ರಿಲ್,14,2025 (www.justkannada.in): 5 ಸಾವಿರ ಎಕರೆ ಜಾಗ ವಿಚಾರಕ್ಕೆ ಚಾಮರಾಜ...