30
Sunday
March, 2025

A News 365Times Venture

IPL 2025: రవిశాస్త్రి కామెంట్స్ వైరల్.. విరాట్ కోహ్లీని ఉద్దేశించేనా?

Date:

ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ సెంచరీ (97) మిస్ అయింది. మూడో స్థానంలో దిగిన శ్రేయస్‌.. ఫోర్లు, సిక్సులతో చెలరేగి 17 ఓవర్‌ పూర్తయ్యేసరికే 90 రన్స్ చేశాడు. అప్పటికి ఇంకా 3 ఓవర్లు ఉండడంతో శ్రేయస్‌ సెంచరీ లాంఛనమే అని అందరూ అనుకున్నారు. అయితే చివరి 3 ఓవర్లలో 4 బంతులను మాత్రమే ఆడాడు. శశాంక్‌ సింగ్ ఎక్కువగా స్ట్రైకింగ్‌ తీసుకోవడంతో.. శ్రేయస్‌ సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. తనకు స్ట్రైకింగ్‌ రాకపోయినా ఫర్వాలేదు, వేగంగా ఆడాలని శ్రేయస్ తనకు చెప్పినట్లు మ్యాచ్‌ అనంతరం మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో శశాంక్‌ చెప్పాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మ్యాచ్ అనంతరం శశాంక్‌ సింగ్‌తో కామెంటేటర్ రవిశాస్త్రి మాట్లాడారు. శశాంక్‌ మాట్లాడుతూ… ‘నిజాయతీగా చెప్పాలంటే.. నేను క్రీజులోకి రాగానే శ్రేయస్ అయ్యర్ నాకు ఒకటే మాట చెప్పాడు. ‘శశాంక్.. నా సెంచరీ గురించి ఆలోచించకుండా దూకుడుగా ఆడు. సెంచరీ కంటే టీమ్ స్కోర్ ముఖ్యం. నీ తరహాలో షాట్లు ఆడేసేయ్’ అన్నాడు. ఆ మాటలు నాలో ఎంతో స్ఫూర్తినిచ్చాయి. శ్రేయస్ అలా చెప్పడంతో వేగంగా ఆడేందుకు ప్రయత్నించా’ అని చెప్పాడు. వెంటనే రవిశాస్త్రి మాట్లాడుతూ.. అది సరైన నిర్ణయం అని, టీమ్‌ గేమ్‌లో ఇలానే ఉండాలన్నారు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడకూడదని చెప్పుకొచ్చారు. రవిశాస్త్రి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. రవిశాస్త్రి వ్యాఖ్యలు విరాట్ కోహ్లీని ఉద్దేశించి అన్నవేనా? అని నెటిజెన్స్ అంటున్నారు.

Also Read: Miami Open 2025: టెన్నిస్ క్రీడాకారిణికి వేధింపులు.. అదనపు భద్రత కేటాయింపు!

ఐపీఎల్‌ 2019లో కోల్‌కతా మ్యాచ్‌ సందర్భంగా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో పరుగు కోసం ప్రయత్నించలేదు. మార్కస్ స్టాయినిస్‌ బంతిని బాదగా .. సింగిల్‌ చాలని కోహ్లీ అతడిని ఆపేశాడు. అప్పటికి కోహ్లీ 96 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. చివరి బంతికి బౌండరీతో విరాట్ సెంచరీ పూర్తి చేశాడు. విరాట్ తన సెంచరీ కోసమే రెండో పరుగు తీయలేదు. వన్డే ప్రపంచకప్‌ 2023లోనూ బంగ్లాదేశ్‌పై సెంచరీకే ప్రాధాన్యం ఇచ్చాడు. దాంతో రవిశాస్త్రి కామెంట్స్ కోహ్లీని ఉద్దేశించేనా? అని నెట్టింట చర్చ జరుగుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮೈಸೂರು ಮತ್ತೊಮ್ಮೆ ಸ್ವಚ್ಛ ನಗರಿ ಪಟ್ಟಕ್ಕೇರಲು ಕೈ ಜೋಡಿಸಿ- ಖೋ ಖೋ ಆಟಗಾರ್ತಿ ಬಿ.ಚೈತ್ರ ಮನವಿ.

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,29,2025 (www.justkannada.in):  ಸ್ವಚ್ಛ ಸರ್ವೇಕ್ಷಣ ಅಭಿಯಾನ ಹಿನ್ನೆಲೆ, ಸಾಂಸ್ಕೃತಿಕ ನಗರಿ...

ഗുജറാത്ത് തന്നെയാണ് സംഘപരിവാറിനെ പ്രകോപിപ്പിച്ചത്; എമ്പുരാനെതിരായ നീക്കങ്ങള്‍ ഇന്ത്യക്ക് ഭൂഷണമല്ല: വി.കെ. സനോജ്

തിരുവനന്തപുരം: എമ്പുരാനിലെ പതിനേഴിലധികം വരുന്ന സീനുകള്‍ വെട്ടിമാറ്റുമെന്ന വാര്‍ത്തകളില്‍ പ്രതികരിച്ച് ഡി.വൈ.എഫ്.ഐ...

`அவர் ஆசையைச் சொல்கிறார்; ஆனால் உண்மையில்…' – விஜய் பேச்சு குறித்து டி.டி.வி.தினகரன்

திருப்பரங்குன்றம் சட்டமன்றத் தொகுதி செயல்வீரர்கள் ஆலோசனைக் கூட்டத்தில் கலந்துகொள்ள மதுரை வந்த...

Swati Sachdeva: తల్లిపై జోకు వేయడంతో వివాదంలో స్టాండ్-అప్ కమెడియన్..

Swati Sachdeva: తాజాగా స్టాండ్-అప్ కామెడియన్ స్వాతి సచదేవా ఓ ప్రదర్శనలో...