18
Tuesday
March, 2025

A News 365Times Venture

Karnataka: రాజకీయ దుమారం రేపుతున్న నర్సు హత్య.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఫైర్

Date:

యువ నర్సు దారుణ హత్య కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లవ్ జీహాద్ పేరుతో యువతిని ట్రాప్ చేసి.. మోజు తీరాక నిందితుడు అంతమొందించాడంటూ బీజేపీ ధ్వజమెత్తుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నర్సు హత్యకు గురైందని మండిపడుతోంది.

హవేరి జిల్లా మసూర్ గ్రామానికి చెందిన యువ నర్సు స్వాతి రమేష్ బ్యాడ్గి.. రాణేబెన్నూర్ పట్టణంలో నర్సుగా పనిచేస్తోంది. నయాజ్ అనే యువకుడు.. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. అయితే ఇటీవల నయాజ్‌కు వేరే సంబంధం కుదిరింది. అంతే స్వాతిని వదిలించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.

మాట్లాడాలంటూ స్వాతిని నయాజ్ పిలిచాడు. నయాజ్.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాణేబెన్నూర్‌లోని స్వర్ణ పార్క్‌కు వచ్చాడు. ఆమె కూడా స్వర్ణ పార్క్ వచ్చింది. అనంతరం అక్కడ నుంచి రట్టిహళ్లిలోని ఓ పాడుబడిన పాఠశాలకు తీసుకెళ్లి గొంతు కోసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని తుంగభద్ర నదిలో పడేశారు.

అయితే మార్చి 3న స్వాతి తప్పిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు గాలించగా.. మార్చి 6న తుంగభద్ర నదిలో మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి పోస్టుమార్గం నిర్వహించగా.. గొంతు కోసి చంపినట్లుగా తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నయాజ్‌ను అరెస్ట్ చేశారు. తాజాగా అతడికి సహకరించిన ఇద్దరు స్నేహితులు వినయ్, దర్గాచారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పెద్దలు కుదిర్చిన వివాహానికి స్వాతి అడ్డొస్తుందన్న ఉద్దేశంతో నయాజ్ చంపినట్లుగా పోలీసులు తెలిపారు.

అయితే ఈ వ్యవహారం తాజాగా రాజకీయ దుమారం రేపుతోంది. మతాంతర హత్యలను అరికట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. ఈ హత్యను ఖండిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ హత్య మనసులను కలత పెట్టేస్తోందని వ్యాఖ్యానించారు. స్వాతి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు.. త్వరతగతిన దర్యాప్తు పూర్తి చేయాలని కోరారు.

2

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನಟ ಪುನೀತ್ ರಾಜ್ ಕುಮಾರ್ 50ನೇ ಹುಟ್ಟುಹಬ್ಬ: ಅಪ್ಪು ಸಮಾಧಿಗೆ ಕುಟುಂಬಸ್ಥರಿಂದ ಪೂಜೆ ಸಲ್ಲಿಕೆ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,17,2025 (www.justkannada.in):  ನಟ ದಿವಂಗತ ಪುನೀತ್ ರಾಜ್ ಕುಮಾರ್ ಅವರ...

ജനാധിപത്യത്തിന് റിവേഴ്‌സ് ഗിയറില്ലെന്ന് രാജഭക്തർ മറന്നുപോകരുത്: നേപ്പാള്‍ പ്രധാനമന്ത്രി

കാഠ്മണ്ഡു: ജനാധിപത്യം ഒരു ഹൈവേ പോലെയാണെന്ന് നേപ്പാള്‍ പ്രധാനമന്ത്രി കെ.പി. ശര്‍മ ഒലി....

Railway Exams: தமிழகத் தேர்வர்களுக்கு வெளிமாநிலத்தில் மையம்; ரயில்வே சொல்லும் காரணம் என்ன?

ரயில்வே தேர்வு வாரியம் (RRB) மூலம் நடத்தப்படும் ஏ.எல்.பி (Assiaitant Loco...

Off The Record: అక్కడ తొక్కుడు పాలిటిక్స్‌ నడుస్తున్నాయా..? పాత నాయకుల్ని కొత్త లీడర్స్‌ తొక్కేస్తున్నారా?

Off The Record: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చిన ముఖ్యమంత్రి...