15
Saturday
February, 2025

A News 365Times Venture

Harish Rao: ప్రజా పాలన, ప్రజా దర్బార్ అంటివి.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే..?

Date:

Harish Rao: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన అని ఎద్దేవా చేశారు. ఇక, పోలీసు పహారా మధ్య గ్రామ సభలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటరులో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజా పాలన అంటివి, సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి, ప్రతి రోజూ ప్రజలను కలుస్త అంటివి, ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి అని సెటైర్లు వేశారు హరీశ్ రావు.

Read Also: Gummanur Jayaram: గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు.. రైలు పట్టాలపై పడుకోబెడతా..!

ఇక, ముఖ్యమంత్రి, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా, సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నావు అని విమర్శలు గుప్పించారు. ఇక, ముఖ్యమంత్రి అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఉంటున్నావు.. మంత్రులు, అధికారులను ప్యాలెస్ కు పిలిపించుకొని, అహంభావం ప్రదర్శిస్తున్నావు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని హరీశ్ రావు మండిపడ్డారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Seeman : 'பிரஷாந்த் கிஷோருக்கு திருப்பரங்குன்றம் பிரச்னையை பற்றி தெரியுமா? – சீமான் காட்டம்

நாம் தமிழர் கட்சியின் ஒருங்கிணைப்பாளர் சீமான் பத்திரிகையாளர்களை சந்தித்திருந்தார். அப்போது,'திருப்பரங்குன்றம் பிரச்னையும்...

CM Revanth Reddy: నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నా పని నేను చేస్తున్నా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ...

ഒഡീഷയിലെ എട്ടാം ക്ലാസ് വിദ്യാർത്ഥികളിൽ 50% പേർക്കും ഹരിക്കാൻ അറിയില്ല, 30% പേർക്ക് കുറയ്ക്കാൻ അറിയില്ല; റിപ്പോർട്ട്

ഭുവനേശ്വർ: ഒഡീഷയിലെ എട്ടാം ക്ലാസ് വിദ്യാർത്ഥികളിൽ പകുതി പേർക്കും അടിസ്ഥാന ഗണിത...